భార్యను కాదని..ప్రియురాలితో లాండ్జిలకు భర్త, ఆ తర్వాత !

-

రాజస్థాన్ లోని సంపుటి గ్రామంలో ప్రకాష్(48), రాజేశ్వరి(35) అనే దంపతులు నివసిస్తున్నారు. ప్రకాష్ సెక్యూరిటీ గార్డ్ పనిచేసేవాడు. ఈ క్రమంలో రాజేశ్వరి రాత్రిపూట ఇంట్లో ఒక్కరే ఉండడంతో పక్కింట్లో ఉన్న సుజాత(25) అనే అమ్మాయితో పరిచయం పెంచుకుంది.

తనతో పాటు రాత్రిపూట ఇంట్లో పడుకోమని చెప్పేది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రకాష్, సుజాతతో స్నేహం చేశాడు. ఈ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. తన భార్యకు తెలియకుండా సుజాతతో బయట తిరుగుతూ, లాడ్జీలకు వెళ్లేవాడు.

ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా గ్రహించిన రాజేశ్వరి ఇద్దరినీ మందలించింది. సుజాత, ప్రకాష్ ని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పేసింది. ప్రకాష్ కూడా సుజాతను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో, రాజేశ్వరి తన బంధువులకు సమస్యను చెప్పుకుంది. తమ బంధువులు ప్రకాష్ సుజాత ని మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రకాష్, సుజాత ఇద్దరు కలిసి రాజేశ్వరిని హత్య చేసి పెళ్లి చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news