సాయి పల్లవి పై ఫైర్ అవుతున్న ప్రముఖ బీజేపీ నేత.. అరెస్ట్ చేయాలంటూ..?

-

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఇటీవల విరాట పర్వం సినిమా ద్వారా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమాలో రానాతో కలిసి సాయి పల్లవి నటించింది. ఈ సినిమా నిన్ను అనగా .. జూన్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎక్కడ చూసినా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కి సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోసంరక్షకులని కాశ్మీరీ పండిట్ల తో పోల్చడం పెద్ద దుమారం లేపాయి.

ఇక ఈ విషయంపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయం గురించి తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఫైర్ అవుతున్నాడు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అంటూ ఆయన మండిపడుతున్నాడు. ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవుల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఎవరికీ ధైర్యం ఉండదు . కానీ హిందువుల మీద మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక సాయి పల్లవి తన సినిమా కోసం కమ్యూనిస్టు పుస్తకాలు చదివి ఆమె మెదడు పనిచేయడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రతి పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి మీద కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపాడు.

ఇక ప్రజల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడినందుకు ఇలా ఒకరిని శిక్షిస్తే తప్ప మరెవరు ఇలాంటి పని చేయడానికి సాహసం చేయరు అంటూ ఆయన కోపంతో ఊగిపోయారు. ఇకపోతే ఇప్పటికే హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి మీద కేసు నమోదు అయింది. అంతేకాదు ఆమె నటించిన విరాట పర్వం సినిమా బాయ్ కాట్ చెయ్యాలని భజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంపై సాయి పల్లవి స్పందించి హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో భాగంగా ఆమె మాట్లాడుతూ. ఇప్పుడు నేనేమి మాట్లాడినా కూడా సినిమా కోసం మాట్లాడుతున్నాను అనుకుంటారు. ఇప్పుడు నేను సినిమా విడుదల అవుతుంది అన్న సంతోషం లో ఉన్నాను .సినిమా విడుదలైన తర్వాత ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడుతాను అంటావు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news