Leopard : నారాయణపేట జిల్లాలో చిరుత మృతి కలకలం…….

-

నారాయణపేట : అడవి జంతువుల వరస మృతి తెలంగాణలో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతుంది. ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు పులులు చనిపోయిన ఘటన మరవక ముందే నారాయణపేట జిల్లాలో మరో చిరుత చనిపోయింది. జిల్లాలోని దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో సంచరించిన రెండు చిరుతపులులను చూసిన ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు.

 

అనారోగ్యంతో ఉన్న ఒక చిరుత పంట పొలాల్లో పడిపోగా మరో చిరుత దగ్గరలో ఉన్న అటవి ప్రాంతంలోకి పారిపోయింది. అటవీ శాఖ అధికారులు చిరుత ఉన్న ప్రదేశం దగ్గరకి వెళ్లే లోపే చిరుత మరణించింది. చిరుత మరణానికి గల కారణాలను దగ్గరలో ఉన్న గ్రామస్తుల నుంచి తెలుసుకుంటున్నారు. చనిపోయిన చిరుతకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు నివేదిక వచ్చిన తరువాత పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని ప్రకటించారు .

Read more RELATED
Recommended to you

Latest news