ukrain crisis : సిఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సిఎం జగన్ మోహన్ రెడ్డి కి నారా లోకేష్ లేఖ రాశారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన ఏపీ విద్యార్థుల విద్యాభ్యాసం పూర్తికి ప్రభుత్వం భ‌రోసా ఇవ్వాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు లోకేష్. రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం తీవ్ర‌మైన‌ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చదువుతున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాల‌కు చేరుకున్నారని వెల్లడించారు.

వ‌చ్చిన విద్యార్థుల్లో కొంతమందికి ఇప్పటికే ఆన్‌లైన్‌లో తరగతులను ప్రారంభించగా, తాము చ‌దివే వ‌ర్సిటీ నుంచి ఎటువంటి స‌మాచారం లేక మరికొందరు అయోమ‌యంలో వున్నారని ఫైర్ అయ్యారు. తమిళనాడు, తెలంగాణా రాష్ట్ర ప్ర‌భుత్వాలు విద్యార్థుల కోర్సులు పూర్తికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, ఆర్థికంగా అయ్యే ఖ‌ర్చు భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా విద్యార్థులు చ‌దువు పూర్త‌య్యే బాధ్య‌త‌ని తీసుకోవాల‌ని కోరుతున్నానని స్పష్టం చేశారు నారా లోకేష్. అసెంబ్లీ సాక్షిగా కల్తీ సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించి సీఎం సభని, ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version