జగన్‌ కు ఆర్టీసీ ఉద్యోగుల ఝలక్‌…విలీనంపై బహిరంగ లేఖ..

-

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆర్టీసీ ఉద్యోగుల లేఖ రాశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులు 2021 లో ఒక పీఆర్సీని కోల్పోయామని ఈ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వల్ల కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని… ఆర్టీసీలో 2017 ఏప్రిల్ లో జరగాల్సిన పీఆర్సీకి 2019 ఫిబ్రవరి లో 25శాతం తాత్కాలిక ఫిట్ మెంట్ ఇచ్చారని ఈయూ తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు 2018 లో ఎంత ఫిట్ మెంట్ ఇస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అంత ఇస్తామని ఒప్పందం జరిగిందని.. ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇచ్చి స్కేల్స్ ఫిక్షేషన్ చేయాలని కోరుతున్నామని లేఖలో ఉద్యోగులు కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. ప్రభుత్వంలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు ఒక్కోటిగా తీసేస్తున్నారన్నారు.

SRBS, SBT, గ్రాడ్యుటీ, HRA లో సీలింగ్ లు అమలు సహా కొన్ని అలవెన్సులు రద్దు చేశారని.. ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న వైద్య సౌకర్యాలు తొలగించి, నెలసరి ఇన్సెంటివ్ లు కూడా నిలుపుదల చేశారని వెల్లడించారు. ఉద్యోగులకు దశాబ్దాలుగా ఇస్తున్న పండుగ అడ్వాన్సులనూ ఆపేశారని.. 2021 పీఆర్సీ నష్టపోతున్నందున చొరవ తీసుకుని న్యాయం చేయాలని సీఎంను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news