ఐదు రోజుల పెళ్లి లాగా… మోదీ కి వారం రోజుల పుట్టిన రోజు..!

-

సెప్టెంబరు 17న.. 70వ పుట్టినరోజు జరుపుకోనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు వేడుకలు నిర్వహించాలని బిజేపి నిర్ణయించింది. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు అన్ని రాష్ట్రాల్లో ‘సేవా సప్తాహ్’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ పంపారు బిజేపి కేంద్ర కార్యాలయ ఇంఛార్జ్​, ప్రధాన కార్యదర్శి అరుణ్​ సింగ్​.

మోదీ 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా ఈ సేవా కార్యక్రమాలను ’70’ ఇతివృత్తంలో నిర్వహించనుంది బిజేపి. దేశంలోని ప్రతి మండలంలో 70 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను పార్టీ కార్యకర్తలు పంపిణీ చేయాలి. 70 మంది అంధులకు కళ్ళజోళ్లు అందజేయాలి. 70 ఆసుపత్రుల్లో, పేదల కాలనీల్లో పండ్లు పంపిణీ చేయాలి. 70 మంది కరోనా రోగులకు ప్లాస్మా విరాళానికి ఏర్పాట్లు చేయాలి. ఈ కార్యక్రమాలను కొవిడ్​ నిబంధనలకు లోబడి నిర్వహించాలి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి.మోదీ పుట్టినరోజు వేడుకల సందర్బంగా ‘లైఫ్ అండ్ మిషన్’ పేరిట ​వెబినార్లను నిర్వహించనుంది బిజేపి.

Read more RELATED
Recommended to you

Latest news