అంబులెన్సును ఆపిన పోలీసులు.. లోపల ఏముందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

-

సాధార‌ణంగా అంబులెన్సు అంటే పేషెంట్లు ఉంటారు. కానీ ఓ అంబులెన్సును అడ్డ‌గించిన పోలీసులు అందులో ఏముందో చూసి షాక్ అయ్యారు. వివ‌రాల్లోకి వెళ్తే.. దేశరాజధాని ఢిల్లీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అంబులెన్సును అడ్డగించిన పోలీసులు.. లోపల ఉన్న వస్తువులను చూసి ఖంగుతిన్నారు. ఎందుకంటే ఆ అంబులెన్సులో పేషెంట్లెవరూ లేరుకానీ, ఓ 460 లిక్కర్ బాటిళ్లున్నాయి. పోలీసులు వాహనాన్ని ఆపగానే దాని డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించాడు.

అతన్ని వెంబడించిన పోలీసులు కాసేపటికే ఆ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అంబులెన్సు ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ హాస్పిటల్‌కు చెందిందని వెల్లడించిన పోలీసులు.. సదరు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకున్నారు. ఈ లిక్కర్ బాటిళ్లను కుందిల్-మానేసర్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే గుండా నిందితుడు స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, ఇందులో ఇంకా ఎవరెవరి హస్తాలున్నాయో త్వరలోనే కనుక్కుంటామని హామీఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news