వైరల్ గా మారిన మినిస్టర్ రోజా అసలు ఆస్తుల చిట్టా..!

-

మినిస్టర్ రోజా గురించి కొత్తగా ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు. హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించింది. అక్కడ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయింది. అంతేకాదు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మంత్రి పదవి ఈ ఏడాది ఆమెను వరించింది. దీంతో ఆమె కుటుంబంలోనే కాదు అభిమానులలో కూడా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మినిస్టర్ అయిన రోజాకు సంబంధించిన ఆస్తుల వివరాలు వైరల్ అవుతున్నాయి. అసలు రోజా దగ్గర ఆస్తి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం.

సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పకుండా.. ఆమె ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి రోజాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1992 నుంచి 2002లో వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయి , అబ్బాయి.. ఇకపోతే మినిస్టర్ రోజా ఆస్తులు విషయానికి వస్తే 2019 ఎన్నికల సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫడవిట్ లో 7 కోట్ల 38 లక్షల రూపాయలకు పైగా ఆస్తి ఉన్నట్టు పేర్కొన్నారు.

అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని స్పష్టం చేశారు. ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అన్షు మాలిక పేర్ల మీద రూ.50, 56,191 డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. ఈమెకు కార్లు అంటే విపరీతమైన ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె పేరు మీద ఏడు కు పైగా కార్లు ఉన్నాయి అంతేకాదు ఇవి మొత్తంగా రూ.ఐదు కోట్లకు పైగా ధర పలుకుతాయి. అంతేకాదు రూ.మూడు కోట్ల చరాస్తులు కూడా ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news