ఇవాళ రాత్రి నుంచి మళ్లీ లాక్‌ డౌన్‌..ఐరోపా దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌..

-

కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రమవుతోంది..రోజువారీ కేసుల సంఖ్యలు పెరుగుతుండటంతో మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు..కరోనా రెండోదశ వ్యాప్తి చాలా ప్రమాదంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది..తొలిసారి వచ్చినదానికన్నా రెండోసారి వచ్చే కరోనా సంక్షోభంలో అత్యధికులు మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు..చాలా దేశాలు ఇప్పడు మళ్లీ కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం అయిన లాక్‌ విధానం అమలు చేయాలని నిర్ణయించాయి..అమెరికా, ఐరోపాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రతిరోజూ దాదాపు లక్ష వరకు కొత్త కేసులు వస్తున్నాయి..యూఎస్‌లో మొత్తం కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువ అవుతోంది..దీంతో చాలాదేశాలు లాక్‌ డౌన్‌ దిశగా అడుగులు వేస్తున్నాయి..ఇప్పటికే ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, బెల్జియంలో లాక్‌డౌన్‌ ప్రకటించగా..బ్రిటన్‌కూడా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.బెల్జియం కూడా ఇవాళ రాత్రి నుంచి లాక్‌ డౌన్‌ అమలు చేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం..ఆసుపత్రుల్లో బెడ్స్‌ కొరత ఏర్పడటంతో..లాక్‌ డౌన్‌ మినహా మరో ప్రత్యామ్నాయం లేదని బెల్జియం ప్రధాని ప్రకటించారు. డిసెంబరు 13 వరకు బెల్జియంలో లాక్‌ డౌన్‌ అమల్లో ఉండనుంది. ఇక ఫ్రాన్స్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన లాక్‌ డౌన్‌.. నాలుగు వారాలపాటు కొనసాగనుంది. మరోవైపు గ్రీస్‌లో కంటైన్మెంట్‌ ఏరియాల్లో మాత్రమే ఉన్న పరిమితుల్ని.. దేశవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.. గ్రీస్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించడంతో పాటు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆదేశాలు ఇచ్చారు. ఐరోపాలో మొత్తం కేసుల సంఖ్య కోటి దాటగా..గత వారంలోనే 15లక్షల కేసులు వచ్చాయి.జర్మనీలో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమలుకానుంది. జర్మనీలో ప్రతిరోజూ దాదాపు 20వేల కొత్త కేసులు వస్తున్నాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌ డౌన్‌ అమలు చేయనున్నారు.బ్రిటన్‌లో మొత్తం కేసుల సంఖ్య పది లక్షలు దాటింది. దీంతో ఆ దేశంలో రెండో లాక్‌డౌన్‌ అమలు చేయునున్నట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు.దాదాపు నెల రోజుల పాటు నిత్యావసర వస్తువేతర షాపులను, హాస్పిటాలిటీ పరిశ్రమను మూసివేయాలని బ్రిటన్‌ భావిస్తున్నట్లు ప్రముఖ చానల్ పేర్కొంది. అలాగే ప్రయాణాలు కూడా నిలిపివేస్తారు. అయితే పాఠశాలలు, కాలేజీలు మాత్రం కొనసాగుతాయని పేర్కొంది. తాజా లాక్‌డౌన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను తాను చూసినట్లు.కేబినెట్‌లో దీనిపై చర్చించాక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news