ఆంటోనీ జీ.. ఓటేయకపోయినా పర్లేదు మీ కుమారుడిని ఆశీర్వదించండి: రాజ్‌నాథ్‌ 

-

‘‘మీకు కుమారుడికి ఓటేయకపోయినా.. కనీసం అతడిని ఆశీర్వదించండి’’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. ఆంటోనీ కుమారుడు అనిల్‌ బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇటీవలే ఏకే ఆంటోనీ బహిరంగంగా స్పందిస్తూ.. తన కుమారుడు ఓడిపోవాలని, ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన ఆంటో ఆంటోనీ విజయం సాధించాలని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ నా మతం’’ అని వ్యాఖ్యానించారు.

తన తండ్రి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌లో కాలం చెల్లిన నేతలు ఉన్నారని, తన తండ్రి పరిస్థితి చూస్తే జాలేస్తోందని అనిల్ వ్యాఖ్యానించారు. ఇక ఈ నేపథ్యంలో కేరళలోని పథనంథిట్టలో అనిల్ కు మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘‘ఏకే ఆంటోనీజీకి నేను చెప్పాలనుకునేది ఒక్కటే. మీ కుమారుడికి మీరు ఓటు వేయకపోయినా కనీసం మీ ఆశీస్సులైనా అందించాలి. కొద్దిరోజుల క్రితం ఆయన మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆంటోనీ ఇబ్బందిని అర్థం చేసుకోగలను. కాంగ్రెస్‌ ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండొచ్చు’’ అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news