లైంగిక వేధింపుల కేసులో..లింగాయత్ మఠాధిపతి శివమూర్తి అరెస్ట్‌ !

-

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోక్సో కేసులో చిత్రదుర్గ మురుఘ మఠాధిపతి రాజేంద్ర శివమూర్తి స్వామిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం రాత్రి మురుఘ రాజేంద్రమటంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేసి వైద్య పరీక్షలకు తరలించారు. గత నెల 26న చిత్రదుర్గ లోని మురుఘ శ్రీ హాస్టల్ లో చదువుకుంటున్న ఇద్దరు మైనర్ విద్యార్థినులు స్వామీజీపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో మైసూరు నజరాబాదు పోలీసులు ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

వారం రోజులుగా ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టులో స్వామీజీ చేసుకున్న దరఖాస్తు పై విచారణ కూడా శుక్రవారానికి వాయిదా పడింది. మరోవైపు మఠం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చివరకు రాత్రి హైడ్రామా మధ్య స్వామీజీ అరెస్టును ప్రకటించారు. ఇదివరకే జడ్జి ముందు బాలికలు వాంగ్మూలం ఇచ్చారు. శుక్రవారం నుంచి స్వామీజీని పోలీసులు విచారించనున్నారు. స్వామీజీకి మద్దతుగా వ్యతిరేకంగా పలువురు నేతలు ప్రకటనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news