సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..ఆ ఎమ్మెల్యేకు కీలక పదవి !

-

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఎమ్మెల్యే మల్లాది విష్ణును నియమించారు. ఈ మేరకు ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో మల్లాది విష్ణు కొనసాగనున్నారు. మల్లాది విష్ణు గతంలో మంత్రి పదవిని ఆశించారు. ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ దక్కింది. విష్ణు కాంగ్రెస్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అనంతరం విజయవాడ సెంట్రల్ నుంచి 2009లో పోటీ చేసి వంగవీటి రాధాపై ఎమ్మెల్యేగా గెలిచారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ పట్టణ అభివృద్ధి చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికలకు వైయస్సార్ సీపీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గతంలో మంత్రి పదవి ఆశించిన దక్కలేదు. ఇప్పుడు కేబినెట్ హోదాతో పదవి దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news