హనుమాన్ జంక్షన్ లో లారీ బీభత్సం.. !

-

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అయి పోయాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కూడలిలో  లారీ బీభత్సం సృష్టించింది. నూజివీడు నుంచి గుడివాడ వెళుతున్న లారీ బైక్ ని ఢీ కొట్టి ఆ తరువాత కారును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. బైక్, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

లారీ డైవర్ పూర్తిగా మద్యం సేవించి ఉండటం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బైక్ పై ప్రయాణిస్తున్న భార్య భర్తలు భర్త సంఘటన స్థలంలోనే మృతిచెందగా భార్యకు రెండు కాళ్ళు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news