ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ముగ్గురు మృతి

-

విజయవాడ: గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున లారీ బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే క్లీనర్ లారీని నడపడం వల్లే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఘటనా స్థలంలో పోలీసు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. బస్తాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలకు పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు రాజ్యలక్ష్మి, శ్రీనివాస్, రోహిత్‌గా గుర్తించారు. వీరు తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన వారిగా చెప్పారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు బోల్తా పడిన లారీని పక్కకు తొలగించారు. రోడ్డుపై వాహనాల ట్రాఫిక్‌ను సరి చేశారు. హైవేలపై లారీలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, అతి వేగం, మద్యం డ్రైవింగ్ అసులు చేయకూడదని పోలీసులు తెలిపారు. ప్రమాదాల వల్ల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుందని పేర్కొన్నారు

Read more RELATED
Recommended to you

Latest news