పురుగ‌ల మందు తాగి ప్రేమ జంట ఆత్మ‌హ‌త్యయ‌త్నం.. యువ‌తి మృతి

-

కూల్ డ్రింక్స్ లో పురుగుల మంది క‌లుపుకుని తాగి.. ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య య‌త్నం చేశారు. ఈ ఘ‌ట‌న లో యువ‌తి మృతి చెందింది. కాగ యువ‌కుని ప‌రిస్థితి విషమంగా ఉంది. ఈ ఘ‌ట‌న కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండ‌లంలో చోటు చేసుకుంది. కాగ మెదక్ జిల్లా తూఫ్రాన్ లో గ‌ల ఘ‌న‌పూర్ అనే గ్రామ‌నికి చెందిన నందీశ్వ‌ర్ అనే యువ‌కుడు.. అదే గ్రామానికి చెందిన స్నేహా (18) అనే యువ‌తి ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.

స్నేహా.. తూఫ్రాన్ లోనే ఒక ప్ర‌యివేటు కాలేజీలో సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతుంది. నందీశ్వ‌ర్.. హైద‌రాబాద్ లో ప‌ని నేర్చుకుటున్నాడు. అయితే ఈ ప్రేమ జంట బుధ వారం కామారెడ్డిలోని తాడ్వాయి లో గ‌ల ఒక గుడి వ‌ద్ద‌కు వ‌చ్చారు. కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు క‌లుపుకుని ఆత్మ‌హత్యయ‌త్నం చేశారు. స్థానికులు గుర్తించి.. వారిని కామారెడ్డి ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

స్నేహా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే నందీశ్వర్ ప‌రిస్థితి విషమంగా ఉండ‌టంతో ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కాగ ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news