లూసిఫర్ రీమేక్ : దర్శకుడిని అనౌన్స్ చేసిన చిరంజీవి

-

ప్రస్తుతం సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల దర్శకత్వంలో ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వరుసగా కన్నడ తమిళ తెలుగు రీమేక్ సినిమాలలో నటించేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి తమిళ హీరో అజిత్ హీరోగా నటించిన వేదాలం సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ లూసిఫార్ రీమేక్ అయితే ప్రకటించారు కానీ దానిని ఎవరు తెరకేక్కిస్తారు అనేది సస్పెన్స్ గానే ఉంచారు.

తాజాగా ఈ మూవీ స్క్రిప్టును ద‌ర్శ‌కుడిని ఫైన‌ల్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. వచ్చేనెల జనవరి 2021 సంక్రాంతి త‌ర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక ఆయన మాట్లాడుతూ “ లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యింది. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత షూట్ కి వెళ్లి ఏప్రిల్ లోపు మొత్తం పూర్తి చేస్తామని అన్నారు. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారని నా సినిమాల పంపిణీదారుడిగా ఆయ‌నతో ఎంతో అనుబంధం ఉందని చిరు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news