మహారాష్ట్ర: ఎమ్మెల్యే ఇంటికి నిరసనకారులు నిప్పు !

-

మహారాష్ట్రలో తాజాగా జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ లపై జరుగుతున్న ఆందోనళ హింసగా చెలరేగుతోంది. మాలెగావ్ లోని ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి ఇంటిపై నిరసన కారులు ఆందోళనలు చేపట్టడమే కాకుండా, ఇంటికి నిప్పు అంటించారు, మరియు ఇంట్లో ఉన్న వాహనాలను కూడా ద్వంసం చేశారు. ఈ దారుభమైన ఘటనపై స్పందించిన మాలెగావ్ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకి, ఘటన జరుగుతున్న సమయంలో నేను ఇంట్లోనే ఉన్నానంటూ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లుగా సోలంకి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఈ ఘటనపై స్పందించి నిరసనకారులు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కానీ నిరసనలు తెలుపుతున్న వీరు కుదుటపడతారా అన్నది చెప్పలేని పరిస్థితి… వెంటనే ప్రభుత్వాలు మేలుకొని వారితో ఒక ఒప్పందానికి రాకపోతే సమస్య ఎక్కువయ్యేలా ఉందని ప్రముఖులు చెబుతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news