బండి సంజయ్ కు మైనంపల్లి సవాల్..నిరూపిస్తే రాజీనామా చేస్తా !

-

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మల్కాజ్‌ గిరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి మరోసారి సవాల్ విసిరారు. దళితుల పై దాడి చేసినట్లుగా బీజేపీ పార్టీ తప్పుడు ఫిర్యాదు చేసిందని నిప్పులు చెరిగారు.దళితుల పై దాడి జరిగిన ఆ సమయంలో తాను ఇంట్లో కూడా లేనని మైనంపల్లి వివరించారు. నిజంగానే దళితుల పై దాడి జరిగిన సమయం లో తాను ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని బండి సంజయ్‌ కి సవాల్‌ విసిరారు.

బండి సంజయ్ వ్యవహారం త్వరలో ఆధారాలతో బయటపెడతానని హెచ్చరించారు. కరీంనగర్‌ జిల్లా లో గ్రానేట్‌ యాజమానులను బెదిరించి.. డబ్బులు నొక్కాడని ఆరోపించారు మైనంపల్లి. అతి త్వరలోనే బండి సంజయ్‌ వ్యవహరం బయటపడుతుందన్నారు. కాగా… మల్కాజ్‌ గిరి నియోజక వర్గంలో దళిత మహిళల పై మైనంపల్లి అనుచరులు దౌర్జన్యంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తో బండి సంజయ్‌, మైనపల్లి మధ్య వివాదం తార స్థాయికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news