దారుణం : ట్యూషన్ కి వచ్చిన బాలుడిపై ఉపాధ్యాయుడి అత్యాచారం..!

-

తల్లి తండ్రి గురువు దైవం అంటారు… కానీ, విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమ కామవాంఛను తీర్చుకునేందుకు పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటన అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది.

లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో అహ్మదాబాద్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు తన ఇంటిలోనే ట్యూషన్ సెంటరును నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి(12) ఈయన ట్యూషన్ లో చేరాడు. అలా వచ్చిన విద్యార్థికి పాఠాలు చెప్పకుండా అతడిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు ఆ ఉపాధ్యాయుడు. ఇలా పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు.

 

అయితే ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ సదరు బాలుడిని బెదిరించడంతో..ఆ బాలుడు మౌనంగా ఉండిపోయాడు. అయితే తాజాగా.. బాలుడు తన మర్మాంగం వద్ద నొప్పిగా ఉందని బాధతో విలవిలలాడిపోతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని స్థానికంగా ఉండే ఓ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడు అసలు విషయం చెప్పడంతో కీచక ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలయ్యింది. దీంతో బాలుడి తల్లిదండ్రులు సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ కీచక  ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news