శాసన సభ అంటే వారికి లెక్క లేదు: మల్లాది విష్ణు

-

శాసన సభ సమావేశాలలో టీడీపీ సభ్యులు ప్రవర్తించిన తీరు అత్యంత హెయమైన చర్య అని అన్నారు మల్లాది విష్ణు. అలానే ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు పోడియం వద్దకి వెళ్లి స్పీకర్ మీద కాగితాలు చించి విసిరేస్తున్నారని అన్నారు. శాసన సభ అంటే వారికి లెక్క లేదని చెప్పారు. ప్రజా ప్రతినిధి అంటే ఆ ప్రాంత ప్రజల సమస్యల గురించి తెలియచేయాలి అన్నారు విష్ణు.

కానీ టీడీపీ సభ్యులు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన అవేమి పట్టించుకోకుండా గందరగోళం సృష్టిస్తారు అని అన్నారు. అలానే ఈ ఐదు సంవత్సరలలో అనేక మార్పులు జరిగాయని చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ లో కానీ విద్యా వ్యవస్థ లో కానీ చాలా మార్పులు చేసారని చెప్పారు. జగన్ నాయకత్వం లో 2024ఎన్నికలు 175 విజయ లక్ష్యం దిశగా ముందుకెళ్తామని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news