మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీలో ఉన్నారు – కాంగ్రెస్‌

-

మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు ఏఐసీసీ అధ్యక్ష్య పోటీలో ఉన్నారని కాంగ్రెస్‌ ప్రకటన చేసింది. ఐఐసీసీ పోటీ ఉపసంహరం సమయం పూర్తయిందని.. ఏఐసీసీ ఎన్నికల పోటీలో ఇద్దరు ఉన్నారన్నారు కాంగ్రేస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ. మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీలో ఉన్నారని.. 17 అక్టోబర్ న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ఉంటాయని తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని… అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని చెప్పారు కాంగ్రేస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్ ఉంటుందని.. భారత్ జోదో యాత్రలో ఉన్న వాళ్లకోసం పోస్టల్ బ్యాలెట్ ఉంటుందన్నారు. ఇక ఈ నెల 19 న ఢిల్లీలో ఓట్ల లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు కాంగ్రేస్ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ.

Read more RELATED
Recommended to you

Latest news