మద్యం మత్తులో మనిషిని కోసి కూర వండేసాడు…!

-

మందులో ఉన్నప్పుడు కొందరి ప్రవర్తన భయపెడుతూ ఉంటుంది. సమాజ౦లో ఇలాంటి మృగాలు కూడా ఉంటారా అనే విధంగా ఉంటుంది కొందరి ప్రవర్తన. తాజాగా ఒక వ్యక్తి ప్రవర్తన చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది. ఏకంగా మనిషిని కోసి కూర వండేసాడు. అవును ఈ సంఘటన నిజంగా జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. బిజ్నూర్‌ జిల్లా టిక్కోపూర్‌ గ్రామానికి చెందిన 32 ఏళ్ళ సంజయ్ ఈ పని చేసాడు.

కొంత కాలంగా మద్యానికి బానిస అయిన సంజయ్… మత్తులో కాస్త వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు, భార్యను కుటుంబ సభ్యులను హింసిస్తూ ఉంటాడు అంతనూ. ఈ క్రమంలోనే సోమవారం ఇలాగే చేసాడు అతను. సోమవారం సాయంత్రం ఫుల్లుగా మద్యం తాగిన అతను గ్రామ శివారులో ఉన్న శ్మశానానికి వెళ్లి మృతదేహం చేయిని లాక్కుని ఇంటికి తీసుకొచ్చి దాని వేళ్లు నరికి గిన్నెలో కూర వండాడు.

ఇదే సమయంలో ఇంటికి వచ్చిన అతని భార్య… ఆ సంఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయింది. దీనితో కంగారు పడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ ఘటన ఇప్పుడు గ్రామంలో ప్రజలను భయపెడుతుంది. అతన్ని కఠినం గా శిక్షించాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news