పెళ్లి జరిగిన వెంటనే చనిపోయిన వరుడు ..!

-

నిజామాబాద్ జిల్లా బోధన్ లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి బోధన లో ఒక వివాహం జరిగింది. సాధారణంగా వివాహం జరిగిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి డాన్స్ వేస్తూ ఉంటారు.

ఇలాగే పెళ్లి అయిన అనంతరం బోధన లో పెళ్లి కొడుకు డాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లి జరిగిన కాసేపటికి బంధుమిత్రులు, తాళి కట్టిన కొత్త భార్యతో డాన్స్ చేసాడు. ఈ క్రమంలో అది కాస్తా శృతి మించడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని పక్కన ఉన్న అతని మిత్రులు ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటనపై అనేక అనుమానాలు కూడా వస్తున్నాయి. అతను మద్యం మితిమీరి సేవించి ఉండవచ్చు అని అందుకే అలా జరిగిందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అతనికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది అనే దానిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుండె పోటు వలన అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు చెప్పినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news