గొంతులో ఆమ్లెట్ ఇరుక్కొని వ్యక్తి మృతి

-

ఓ వ్యక్తి మద్యం తాగుతున్నాడు. మధ్య మధ్యలో మంచింగ్​కి ఆమ్లెట్ తినాలనుకున్నాడు.  మందు తాగుతూ మధ్య మధ్యలో కాస్త ఆమ్లెట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. అకస్మాత్తుగా ఆమ్లెట్ అతడి గొంతులో ఇరుక్కుపోయింది. అంతే.. అక్కడికక్కడే అతడు చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

omlet

బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. భూపాల్ రెడ్డి మృతితో అతడి కుుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news