నిద్ర మత్తులో కరెంట్ స్థంభం ఎక్కేసాడు…!

-

నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది కదూ…? మంచి నిద్రలో ఉన్న వాళ్ళు లేచి రోడ్ల మీదకు వెళ్ళడం, పక్కింటికి వెళ్ళడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాని ఒక వ్యక్తి నడుస్తూ కరెంట్ స్థంభం ఎక్కేసాడు. అవును మాస్టారూ అక్షరాలా నిజం ఇది. మహబూబాబాద్ జిల్లాలో నందీ నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది.

నడుస్తూ నడుస్తూ వెళ్లి ఒక కరెంట్ స్థంభం ఎక్కాడు. అతను నడుస్తూ వెళ్లి కరెంట్ స్థంభం తూలుతూ ఎక్కుతుంటే అక్కడే ఉన్న ఒక కుర్రాడు చూసాడు. వెంటనే డౌట్ వచ్చింది. అతను కరెంట్ పని చేసే వ్యక్తి కాదు. దీనితో వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అందరూ అక్కడికి చేరుకొని కరెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కరెంట్ అధికారులు ఆ లైన్ లో కరెంట్ ఆపేశారు.

వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకొని అతన్ని జాగ్రత్తగా కిందకి దించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఎక్కావా అని ప్రశ్నించగా… కాదు సార్ నిద్రలో ఎక్కా అని చెప్పాడు. దీనితో అందరి మైండ్ పోయింది. కరెంట్ సిబ్బంది, పోలీసులకు మైండ్ పోయింది. దీనిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్దమయ్యారు. అతను మాత్రం నిద్రమత్తులోనే ఎక్కా అంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news