తాడేపల్లిలో దారుణం.. గంజాయి మత్తులో యువతిని ఘోరంగా నరికి..

-

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ కట్ట ప్రాంతంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అంధురాలైన యువతిపై అదే ప్రాంతంలో ఉంటున్న దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే లోపే  ఆమె ప్రాణాలు కోల్పోయింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించి.. అతడి కోసం గాలింపు చేపట్టారు. గంజాయి మత్తులో అతడు ఈ దాడి చేసినట్లు సమాచారం. ఆదివారం రోజున రాజు యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆమె ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు అతడిని నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version