మద్యం మత్తులో గొడవ.. బ్లేడ్‌తో స్నేహితుడి గొంతు కోసి పరారైన వ్యక్తి

-

చిన్నపాటి విషయంపై మెుదలైన గొడవ యువకుడి ప్రాణం తీసిన ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అరుణ్ యాడ్స్ లో పనిచేసే ఇద్దరు స్నేహితులు పని నిమిత్తం బోడుప్పల్‌కు వెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులో ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న గొడవ తలెత్తింది.

చినికి చినికి గాలి వానైనట్లు చిన్న వాగ్వాదం పెద్ద గొడవకు దారి తీసింది. మద్యం మత్తుోల విచక్షణ కోల్పోయి బల్కంపేటకు చెందిన శ్రీనివాస్ అతని స్నేహితుడు వాసుపై దాడి చేసి గాయపరిచాడు. అక్కడితో ఆగకుండా ఫ్లెక్సీలకు ఉపయోగించే బ్లేడ్‌తో అతడి గొంతు కోశారు. అనంతరం అక్కణ్నుంచి పరారయ్యాడు . తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

తెల్లవారుజామున అటుగా వెళ్తున్న స్థానికుగు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news