దారుణం : చేతబడి అనుమానంతో అల్లుడిని తగలబెట్టిన అత్తింటివారు  

-

జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మల్యాల మండలం బల్వంతపూర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేయించాడనే అనుమానంతో అత్తింటివారే యువకుడిని సజీవదహనం చేసినట్టు సమాచారం. మృతి చెందిన పవన్ హైదరాబాద్ అల్వాల్ కు చెందిన సాఫ్టవేర్ ఉద్యోగి అని గుర్తించారు.  చేతబడి, కుటుంబ గొడవల నేపథ్యంలో పవన్ ను గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించారు బంధువులు. 12 రోజుల క్రితం మృతుడి బామ్మర్ది జగన్ అనారోగ్యంతో మృతి చెందారు.

ఈ క్రమంలో కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు భార్య కృష్ణవేణి తో జిల్లాకు వచ్చాడు పవన్. అయితే పవన్ చేతబడి చేపించి తన భర్తను చంపించడానే కారణంతో జగన్‌ భార్య సుమలత పవన్ ని ఓ గదిలో బంధించి ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించింది. ఈ సజీవ దహనంలో మరికొంతమంది పాల్గొని ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. పోలీసుల అదుపులో ప్రస్తుతం కొంతమంది నిందితులు ఉన్నట్లు చెబుతున్నారు. మృతుడి భార్య క్రిష్ణ వేణి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news