తల్లితో ఎఫైర్ పెట్టుకుని పసి బిడ్డను చంపేసాడు…!

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఏడాదిన్నర పసి బాలుడు హత్య కేసులో నాగరాజు నిందితుడుగా తేల్చారు పోలీసులు. హత్యకు గురైన బాలుడు తల్లితో నాగరాజు కు ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తేల్చారు పోలీసులు. ఈ నెల 18న నిజామాబాద్ బస్టాండ్ లో తల్లి దగ్గర నుంచి బాబును ఎత్తుకెళ్లిన నాగరాజు ఈ హత్యకు పాల్పడ్డాడు. అదే రోజు రాత్రి 11 గంటలకు అర్సపల్లి కి వచ్చి ఫుల్లుగా మద్యం తాగాడు.

crime
crime

అదే మత్తులో సిమెంటు దిమ్మతో బాలుడుని నాగరాజు కొట్టాడు. బలంగా తలకు గాయం అవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు చిన్నారి. అదే రాత్రి బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లి బాసర కు చేరుకున్న నాగరాజు.. మరుసటి రోజు రైల్వే స్టేషన్ సమీపంలో పొదల్లో పారేసి పరారయ్యాడు. సిసి కెమెరాల్లో నాగరాజు బాలుడి మృతదేహాన్ని భుజాన వేసుకొని తీసుకెళ్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. 25వ తేదీ జిల్లా కేంద్రంలో నిందితుడు కనిపించడంతో చితకబాదారు మహిళ బంధువులు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోనీ విచారించడంతో వెలుగులోకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news