హైదరాబాద్ లో దారుణం : మద్యం తాగించి ముంబై యువతి రేప్

-

హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో దారుణం జరిగింది. ముంబై నుండి వచ్చిన ఓ యువతికి బలవంతంగా మద్యం ఇచ్చి రేప్ చేశాడు ఓ కామాందుడు. దీంతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. ముంబై కి చెందిన బాధిరురాలి ఫిర్యాదు మేరకు జుబేర్, ప్రజక్త, స్వీటీ లపై కేసు నమోదు చేసారు. ముంబైకి చెందిన యువతి మిత్రుడు క్రిష్ణ చౌదరితో బాధితురాలికి ప్రజక్త పరిచయమైంది. అన్షూ కుక్రేజా అనే వ్యక్తి తనని హెరాస్ చేస్తున్నాడని కొన్ని రోజులు ముంబై బాధితురాలి ఇంట్లో ఉంటానని ప్రజక్త రిజ్వెస్ట్ చేసింది. బాధితురాలికి జూన్ 10న ఫోన్ చేసిన స్వీటి, హైదరాబాద్ లో మిత్రుడు జుబేర్ ది బర్త్ డే కు హాజరవాలని బాధితురాలు అలానే ప్రజక్తను ఇన్వైట్ చేసింది స్వీటి.

మే 11th న హైదరాబాద్ చేరుకున్న బాధితురాలు, ప్రజక్తలు, హైదరాబాద్ లో ఓ ప్రముఖ హోటల్ లో దిగారు. ఆ రోజు రాత్రి జుబేర్ అండ్ స్వీటి హోటల్ కి వెళ్లి ప్రజక్త, బాధితురాలిని కలిశారు. ఆ తర్వాత జుబేర్,స్వీటి, ప్రజక్త కలిసి బాధితురాలి కి మద్యం తాగించారు. అనంతరం జుబేర్ బాధితురాలిని లైగింకంగా వేధించి రేప్ చేశాడు. ఆ తర్వాత స్వీటి జుబేర్ వెళ్లిపోయారు. మే 14న ముంబై వెళ్ళిన బాధితురాలు అక్కడి పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. అంటే కాదు రేప్ తర్వాత బాధితురాలు బట్టలు మార్చుకునేటపుడు వీడియో తీసిన ప్రజక్త, కేసు వాపస్ తీసుకోవాలని అప్పటి న్యూడ్ వీడియోలు వాట్సాప్ చేసి బెదిరింపులకి దిగింది. దీంతో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news