రాత్రి మందేసిన ఫ్రెండ్స్.. తెల్లారేసరికి అనుమానాస్పద మృతి ?

-

హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్ మైలార్దేవ్ పల్లి ఆప్కో కాలనీ లో వెంకటేష్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాత్రి స్నేహితుడు రాజు తో కలసి ఓ బిల్డింగ్ పై మద్యం సేవించిన వెంకటేష్ తెల్లవారే సరికి బిల్డింగ్ కింద శవమై కనిపించాడు. అయితే వెంకటేష్ మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అతని కుటుంబ సభ్యులు.

murder
murder

ఈ ఘటన మీద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్ ను రాజు బిల్డింగ్ పై నుండి తోసేసాడా? లేక మద్యం మత్తులో కాలు జారి పడిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు   మైలార్దేవ్ పల్లి పోలీసులు.  ఇక వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news