మోహన్‌బాబు కుటుంబంలో కరోనా కలకలం..మంచు లక్ష్మికి పాజిటివ్

-

చిత్రపరిశ్రమలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కారణంగా పలు పాన్ ఇండియా మూవీ లు వాయిదా పడుతూ ఉండగా… అటు సినిమా నటులను కరోనా వదలడం లేదు. ఇప్పటికే కమల్ హాసన్, మంచు మనోజ్, విశ్వక్ సేన్ లాంటి టాలీవుడ్ హీరోలకు కరోనా మహమ్మారి సోకింది. ఇక తాజాగా మంచు మోహన్ బాబు ముద్దుల కూతురు… మంచు లక్ష్మి కి కరుణ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఈ విషయాన్ని స్వయంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. గత రెండు రోజుల నుంచి జలుబు తో బాధపడుతున్న మంచు లక్ష్మి.. ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకుంది. అయితే ఈ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంచు లక్ష్మి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్ళింది. ” రెండు సంవత్సరాలుగా కరోనా భూతం ప్రపంచాన్ని వణికిస్తుంది… చివరికి ఈ కరోనా నాకు కూడా సోకింది. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. కొంచెం జలుబు చేసినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు భౌతిక దూరం తో పాటు మాస్కులు కచ్చితంగా ధరించాలి” అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news