ఆదిపురుష్‌ టీజర్‌పై మంచు విష్ణు కామెంట్స్‌.. అలా చేస్తే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కావు

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా బాలీవుడ్‌ ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్‌. అయితే.. ఈ సినిమాకుపై ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే… రామాయణం ఆధారంగా రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక సినిమా ఆదిపురుష్‌ గురించి తాను ఏదో ఊహించుకున్నానని, కానీ టీజర్ తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని ప్రముఖ నటుడు మంచు విష్ణు అన్నారు.

Manchu Vishnu: నటుడిగా జీవితం బాగుంది.. 'మా' ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయను:  మంచు విష్ణు

లైవ్, యాక్షన్ చిత్రంగా రామాయణాన్ని ఆవిష్కరిస్తారని ఆశించానని కానీ, ఇదొక యానిమేటెడ్ మూవీ అని అనుకోలేదని అన్నారు. అందుకే ఈ టీజర్ చాలామందిని నిరాశకు గురిచేసిందని అన్నారు. సినిమా విడుదలకు ముందే ఇదొక యానిమేటేడ్ సినిమా అని చెప్పి ఉంటే ఇన్ని ట్రోల్స్ వచ్చేవి కావన్నారు మంచు విష్ణు. ప్రేక్షకుల్ని మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయని, టీజర్ చూసి తాను కూడా మోసపోయానని మంచు విష్ణు అన్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నుంచి రామాయణం సినిమా వస్తోందంటే, అందులోనూ ‘తానాజీ’ దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నారంటే భారీగానే ఊహించుకున్నట్టు చెప్పారు మంచు విష్ణు. ప్రేక్షకులకు కూడా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని అన్నారు. అలాంటి సమయంలో యానిమేటెడ్ వీడియోతో వస్తే ఇలాగే ఉంటుందని అన్నారు మంచు విష్ణు.

Read more RELATED
Recommended to you

Latest news