మంచువిష్ణు ‘కన్నప్ప’ నుంచి శరత్ కుమార్ ఉగ్రరూపం పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక కథ నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ మూవీపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్కు ఫిదా అయిన ప్రేక్షకులు.. మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా.. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఇవాళ శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కారెక్టర్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన నాథనాధుడిగా కనిపించబోతున్నాడని తెలుస్తుండగా.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో ఓ యోధుడిలా కనిపిస్తున్న శరత్ ఉగ్రరూపాన్ని మనం చూడొచ్చు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని పద్మశ్రీ డా.మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో.. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలో నటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news