టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసిన పోలీసులు

-

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి బద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ లో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరారు పోలీసులు. ఈ మేరకు టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేశారు పోలీసులు. విచారణ లో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని పార్టీ రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు.

అయితే.. దీనిపై తెలుగు దేశం పార్టీ ఇంకా స్పందించలేదు. ఇక అటు ఇవాళ ముఖ్య నేతలతో భేటి అయ్యారు చంద్రబాబు. చంద్రబాబుతో జరిగే సమావేశానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు యనమల, పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో సీనియర్ నేతలతో భేటి అయ్యారు చంద్రబాబు. సోమవారం రాష్ట్రపతిని కలవనున్నారు చంద్రబాబు మరియు ఇతర టీడీపీ నేతలు. రేపు రాష్ట్రపతితో భేటీలో ఆర్టికల్ 356 పెట్టాలని కోరనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news