హైదరాబాద్‌లో ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు

-

వెస్ట్ జోన్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఐదుగురు పోలీసు సిబ్బంది పై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సస్పెండ్ వేటు వేశారు. సస్పెండ్ వేటు గురైన వారిలో మంగళహాట్ పిఎస్ ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ మురళి, ఈమనెల్ మరియు కానిస్టేబుల్స్ రవి కిరణ్ & జానకిరామ్ ఉన్నారు.  గతంలో మంగళ్ హాట్ లో పేకాట స్థావరం పై దాడులు జరిపి 2 లక్షల 50 వేలకు పైగా నగదు లభించగా… అందులో సీజ్ చేసిన నగదు గోల్ మాల్ చేసిన కేసులో వీరిని సస్పెండ్‌ చేశారు.

ఈ వ్యవహారం పై ఎస్బి విచారణ కు నగర సిపి ఆదేశించగా… ఈ విచారణలో నగదు గోల్ మాల్ చేసినట్లు ఎస్బి రిపోర్ట్ ఇచ్చింది. దీంతో మంగళ్ హాట్ పోలీసుల పై సస్పెండ్ వేటు వేశారు నగర పోలీస్ కమిషనర్ కొత్వాల్ అంజనీ కుమార్. కాగా.. గతంలో ఇదే కేసులో హుసేన్ ఆలం పిఎస్ కానిస్టేుబుల్ శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news