చిత్తూరు జిల్లాలో రోడ్డుపై గుట్టలు గుట్టలుగా మామిడిపళ్లు

-

చిత్తూరు: జిల్లాలో మామిడిపండ్లకు గిట్టుబాటు ధర పడిపోయింది. ఇంత కాలం పండ్లను కంటికి రెప్పలా కాపాడి  అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కనీస ధర కూడా పలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తీసుకొచ్చిన మామిడిపళ్లను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. మరీ దారుణంగా రేటు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల నుంచి ట్రాక్టర్లతో తీసుకొచ్చి మామిడి పళ్లను గుట్టగుట్టలుగా రోడ్లపై పోసి వెళుతున్నారు.

ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాలతో మామిడి పళ్లు చెట్ల నుంచి రాలిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు దళారులు మరింత నష్టం చేస్తున్నారు. ఇష్టమొచ్చినట్లు ధరలు తగ్గించి రైతులను దోచుకోవాలని చూస్తున్నారు. దీంతో మామిడి రైతులు లబో దిబో మంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అంటున్నారు. ఇప్పటివరకూ రోడ్లపై టమాటాలను చూసిన ప్రజలకు మామిడిపండ్లు కనిపిస్తుండటంతో ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news