మణిపూర్ లో ఉగ్రవాద దాడి…. నలుగురు జవాన్ల తో సహా ఏడుగురు మరణం

-

మరోమారు ఈశాన్య రాష్ట్రం ఉగ్రవాద దాడితో రక్త మోడింది. మణిపూర్ రాష్ట్రంలో ఉగ్ర ఘాతుకం చోటు చేసుకుంది. మణిపూర్ రాష్ట్రం చురచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ లో దాడి జరిగింది.  46 అస్సాం రైఫిల్ జవాన్ల కాన్వాయే లక్ష్యంగా ఉగ్రవాద దాడి జరిగింది. దాడిలో కల్నల్, నలుగురు జవాన్లతో సహా మొత్తం ఏడుగురు మరణించారు. దాడిలో కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి, భార్యతో పాటు ఆయన కుమారుడు మరణించారు.

మెరుపుదాడితో 46 అస్సాం కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్ వెళుతున్నసమయంలో దాడి జరిగింది. మొదట ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు, తరువాత కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మయన్మార్, భారత్ సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా ఇప్పటి వరకు దాడి మేమే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు.  స్థానికంగా మణిపూర్ బెస్డ్ లిబరేషన్ఉగ్రవాదులే కారణమని అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news