ఐఆర్‌సీటీసీ అదిరే టూర్.. రూ.505తో హైదరాబాద్ ని చూసొచ్చేయచ్చు…!

-

హైదరాబాద్ చూడాలని అనుకుంటున్నారా..? అయితే మీకు ఒక అదిరే ఆప్షన్ ఒకటి వుంది. దీనితో ఈజీగా హైదరాబాద్ లో పలు ప్రాంతాలని మీరు చుట్టేసి వచ్చేయచ్చు. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజ్ ని అందిస్తోంది. దీనితో చక్కగా హైదరాబాద్ ని చూసి వచ్చేచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఐఆర్‌సీటీసీ ఎదో ఒక ప్యాకేజీని తీసుకు వస్తుంది. అయితే ఇప్పుడు ఎప్పటిలాగే అదిరిపోయే టూర్ ప్యాకేజ్ అందిస్తోంది. దీనితో మీరు తక్కువ ధరలోనే హైదరాబాద్ చుట్టేసి వచ్చేయచ్చు. పైగా ఇది ఒక్క రోజు టూర్ మాత్రమే. సికింద్రాబాద్/ నాంపల్లి/ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఈ టూర్ అనేది స్టార్ట్ అవుతుంది.

టూర్ ప్రతి రోజూ ఉంటుంది. టూర్‌లో భాగంగా ట్యాంక్ బండ్, బిర్లా మందిర్, సలార్‌జంగ్ మ్యూజియం, మక్కా మసీద్, చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌సాహి సమాధులు, చౌమొహల్లా ప్యాలెస్ వంటివి చూడొచ్చు. సోమవారం, శుక్రవారం మాత్రం ఉండదు.

ఐఆర్‌సీటీసీ హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ వచ్చింది. ఇక ఎంత డబ్బులు అవుతాయి అనేది చూస్తే… నలుగురు నుండి ఆరుగురు అయితే రూ.1170 పడుతుంది. అదే ఏడు నుండి పన్నెండు మంది గ్రూప్ బుకింగ్ ఆప్షన్ అయితే ఒక్కొక్కరికి రూ.1145 అవుతుంది. అదే పదమూడు నుండి ఇరవై రెండు మంది గ్రూప్ బుకింగ్‌ ఆప్షన్‌కు అయితే రూ.505 చెల్లించాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news