మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బ… కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే మరణం

-

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చత్తీస్గడ్ బస్తర్ రీజియన్ మాడ్ అటవీ ప్రాంతంలో మరణించినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీతో పాటు బస్తర్ ఎస్పీ ధ్రువీకరించారు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట. గత నాలుగు దశాబ్ధాలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఆర్కే మావోయిస్టు పార్టీ టాప్ 3 నాయకుల్లో ఒకరు. మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి, కిషన్ జీ తరువాత ఆర్కే ముఖ్యస్థానంలో ఉన్నారు. అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన నక్సల్ దాడిలో ఆర్కే ప్రమేయం ఉంది. 2004లో మావోయిస్టు నేతలతో వైఎస్ ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఆర్కే కీలకంగా వ్యవహరించారు. గత నాలుగేళ్ల క్రితం బలిమెలలో జరిగిన ఎన్ కౌంటర్లో తీవ్రంగా గాయపడ్డారు. అదే ఎన్కౌంటర్లో ఆర్కే కుమారుడు మున్నా కూడా మరణించాడు. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో ఆర్కే బాధపడుతన్నట్లు సమాచారం. దేశంలో జరిగిన పలు మావోయిస్టు దాడుల్లో ఆర్కే ప్రమేయం ఉంది. ఆర్కేపై దాదాపుగా 200పైగా పోలీస్ కేసులు ఉన్నాయి. కోటి రూపాయల దాకా రివార్డ్ ఉంది. ఆర్కే మరణం మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బగా అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news