ములుగు జిల్లాలో దారుణం..ఓ వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు

-

ములుగు జిల్లా వెంకటాపురం మండలం లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నేపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ అనే వ్యక్తిని మావోయిస్టులు హత్య చేశారు.

హత్య చేసిన అనంతరం.. పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే ఎవరికైనా ప్రజా కోర్టులో శిక్ష తప్పదని వెల్లడించారు.

ములుగు జిల్లాలో డీజీపీ పర్యటించి 15 రోజులు గడపకముందే ఈ ఘటన చోటు చేసుకుంది. ఏజెన్సీలో డిజిపి పర్యటించిన మరుక్షణం మావోయిస్టులు ఇన్ ఫార్మర్లను హత మారుస్తున్నారు. గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేయడంతో ఏజెన్సీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. అటు గ్రామాల్లోకి దళం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు మావోలు.

Read more RELATED
Recommended to you

Latest news