రేపే రిలీజ్ కానున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మది”..

-

శ్రీరామ్‌ నిమ్మల, రిచాజోషి జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ మది. ఈ సినిమాకు నాగ ధనుష్‌ దర్శకత్వం వహించగా, పీవీఆర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి.. చేసుకుని రిలీజ్‌ కు రెడీ అయింది. ప్రగతి పిక్చర్స్‌ బ్యానర్స్‌ పై రామ్‌ కిషన్‌ నిర్మిస్తున్న సినిమా ఇది. ఆర్వీ సినిమాస్‌ సహ నిర్మాతలుగా, ఆర్వీ రెడ్డి సమర్ఫణలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది. ఈ తరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా, వినూత్న రీతిలో కథనం సాగనుంది. ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించనుందని నిర్మాత రామ్‌ కిషన్‌, సహా నిర్మాత శ్రీనివాస్‌ రామిరెడ్డి ప్రకటించారు. ఈ సినిమాలో రామ్‌ కిషన్‌, శ్రీకాంత్‌, బైరోజ్‌, స్నేహ మాధురి శర్మ, యోగి కత్రి, శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర బృంధం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news