బ్రేకింగ్ : తెలంగాణలో ల్యాండ్ మైన్ పేల్చిన మావోలు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్ట్ సమీపంలో నిన్న రాత్రి మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఇటీవల గుండాల మండలం లో జరిగిన ఎన్ కౌంటర్ కి నిరసనగా మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ బాంబ్ పేల్చినట్టు చెబుతున్నారు. తిప్పాపురం ప్రధాన రహదారి మీద మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చడంతో పోలీసులు .కూంబింగ్ ఉదృతం చేశారు. అయితే ఈ బ్లాస్ట్ లో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.

ఉనికి కోసమే మావోయిస్టులు మందుపాతర పేల్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. శంకర్ ఎన్కౌంటర్ కి నిరసనగా నిన్న ఆదివారం నాడు భద్రాద్రి జిల్లా తూర్పు గోదావరి జిల్లా భూపాలపల్లి ములుగు జిల్లాల బంద్ కి మావోయిస్టులు పిలుపునిచ్చారు. బంద్ వల్ల జన జీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకే తమ ఉనికి చాటుకోవడానికి గత రాత్రి చర్ల సమీపంలోని తిప్పాపురం అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై మందు పాత్ర పేల్చి శంకర్ పేరుతో వేసిన ఒక కరపత్రాన్ని వదిలిపెట్టి వెళ్లారు .ఈ ఘటనతో పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news