బంగారం, వెండి ధరలు పైపైకి..!

-

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ పెరగడం మొదలుపెట్టింది. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ. 20 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 53,310 కి చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 20 పెరుగుదలతో రూ. 48,880 కు చేరింది. పసిడి ధర పైకి కదులుతుంటే.. వెండి ధర కూడా దాని బాటలోనే నడిచింది. కేజీ వెండి ధర రూ. 150 పెరిగింది. దీంతో ధర రూ.67,200 కి చేరింది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ.10 పెరుగుదలతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ. 54,120 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,610 ఉంది. ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే బంగారం ధర ఔన్స్‌ కు 1942 డాలర్లకు చేరగా. వెండి ధర ఔన్స్‌ కు 27.07 డాలర్లకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news