రోడ్డు ప్రమాదంలో ప్ర‌ముఖ సింగర్ మృతి..

-

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ గీతా మాలీ మృతి చెందారు. ఈ ప్రమాదం ముంబై- ఆగ్రా హైవేపై చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున 3గంటలకు ఆమె ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కంటైనర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో గీతా మాలి,ఆమె భర్త తీవ్ర గాయాలపాలయ్యారు. ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని షాపూర్ రూరల్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ గీతా మాలి కన్నుమూశారు. ఆమె భర్త పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆమె తన స్వగ్రామం నాసిక్‌కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కాగా,గీతా మాలి పలు మరాఠీ సినిమాల్లో పాటలు పాడారు. అలాగే పలు సొంత ఆల్బమ్స్ కూడా రూపొందించారు. ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news