మారుతి సుజుకి బంపర్‌ ఆఫర్‌.. బై నౌ, పే లేటర్‌ స్కీం..

-

ప్రముఖ కార్ల తయారీదారు మారుతీ సుజుకి దేశంలోని కార్ల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందిస్తోంది. కరోనా వల్ల ఈఎంఐలు కట్టలేని స్థితిలో ఉన్నవారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలు చేసేలా ఓ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. బై నౌ, పే లేటర్‌ పేరిట ఆ ఆఫర్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెట్టింది. దీంతో వినియోగదారులు కారును కొన్న 2 నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు.

maruti suzuki offers buy now pay later scheme for new car buyers

కాగా ఈ ఆఫర్‌కు గాను మారుతీ సుజుకి.. చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. దీని వల్ల కొత్తగా మారుతి సుజుకి కార్లను కొనేవారు ఇప్పటి నుంచి 2 తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు. 2 నెలల వరకు ఈఎంఐ డిఫర్‌మెంట్‌ లభిస్తుంది. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్‌లెట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందని ఆ సంస్థ తెలియజేసింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్‌పైనే ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని తెలిపారు. అలాగే జూన్‌ 30వ తేదీతో ఈ ఆఫర్‌కు గడువు ముగుస్తుందని అన్నారు.

తాము ప్రవేశపెట్టిన ఈ ఆఫర్‌ వల్ల కారు కొనాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందని, వెను వెంటనే ఈఎంఐలు కట్టే భారం తప్పుతుందని మారుతీ సుజుకి, చోళమండలం కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుత తరుణంలో నగదుకు ఇబ్బందిగా ఉన్న దృష్ట్యా కార్లను కొనేవారికి ఈ ఆఫర్‌ ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news