మర్యాద రామన్న కాంబో మళ్ళీ రిపీట్..

-

కమెడియన్ గా ఉండి హీరోగా మారిన సునీల్, మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అవ్వలేదు. హీరోగా విజయాలు రాకపోయే సరికి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సునీల్ హీరోగా విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. చడీ చప్పుడు లేకుండా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపు చివరి దశకి వచ్చేసింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా సలోని నటిస్తుందని సమాచారం. సునీల్, సలోని జంటగా మర్యాద రామన్న సినిమాలో కనిపించారు. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మరి మరోమారు వీరిద్దరు కలిసి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇంతకీ ఈ సినిమా గురించ ఎప్పుడు బయటపెడతారనేది సస్పెన్స్ గా మారింది. షూటింగ్ నడుస్తున్నా ప్రచారం చేయకపోవడంలో మతలబు ఏంటో వారికే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news