బ్రేకింగ్: ఎల్లుండు కేసీఆర్ బహిరంగ సభ

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం విషయంలో ఇప్పుడు తెరాస దూకుడుగా ఉంది. తెరాస అగ్ర నేతలు అందరూ కూడా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి కేటిఅర్ సహా ఇతర మంత్రులు అందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక సిఎం కేసీఆర్ ప్రచారం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆయన ప్రచారం నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 28న ఎల్బీ స్టేడియం లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. సభకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియం లో ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బలమల్లు పరిశీలిస్తున్నారు. ఇక ఈ సభకు ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రసంగంపై అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news