త‌మన్నా వ‌ల్ల కోట్ల న‌ష్టం..మాస్ట‌ర్ చెఫ్ నిర్వాహ‌కుల ఆగ్రహం..!

-

జెమినీ టీవీలో మాస్టర్ చెఫ్ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంకు మొదట హెస్ట్ గా నిర్వాహకులు తమన్నాను తీసుకున్నారు. ఆ తర్వాత రెండవ రెండ‌వ సీజ‌న్ కు అన‌సూయ‌ను తీసుకున్నారు. ఈ క్రమంలో తమన్నా మాస్ట‌ర్ చెఫ్ కార్యక్రమం పై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ విషయంపై తాజాగా మాస్టర్ చెఫ్ నిర్వాహ‌కులు స్పందించారు. మొదట తమన్నాతో రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే 18 రోజులు త‌మ‌న్నా షూటింగ్ కు రావాల్సి ఉండగా ఇతర షూటింగ్ ల‌ కారణంగా 16 రోజులు షూటింగ్ కు హాజ‌ర‌య్యింద‌ని చెప్పారు.

దాంతో తమకు రూ.5 కోట్ల‌ నష్టం వచ్చిందని పేర్కొన్నారు. తమన్నాకు ఇప్పటికే తాము 1.56 కోట్ల పేమెంట్ చెల్లించామ‌ని చివరి రెండు రోజులు వ‌చ్చి ఉంటే పేమెంట్ పూర్తిగా ఇచ్చేవాళ్ళం అని పేర్కొన్నారు. అగ్రిమెంట్ ప్రకారం తమన్నా షూటింగ్ పూర్తి చేయకుండానే సెకండ్ సీజన్ అడ్వాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేసిందని చెప్పారు. అసలు సెకండ్ సీజ‌న్ లో త‌మ‌న్నాను తీసుకోవాలని తాము భావించలేదని చెప్పారు. తమన్నా కు సంబంధించి ఏ వార్త రాయాల‌న్నా త‌మ‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news