ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడం ఖాయము : దగ్గుబాటి పురంధేశ్వరి

-

కార్యకర్తలే పార్టీకి ప్రధాన బలమని బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తల ఆధారిత పార్టీ అని అన్నారు.

పార్టీ అభివృద్ధి చెందడంలో కార్యకర్తల పాత్ర ఎంతో ఉందని, ఈ నేపథ్యంలో వారి సేవలను ప్రశంసిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు అందరీ సమిష్టి కృష్టితో ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో అటు దేశంలో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని అన్నారు దగ్గుబాటి పురంధేశ్వరి.ప్రధానంగా ఇటివల ఎన్నికల సమయంలో కార్యకర్తలు పార్టీకి అందించిన సేవలు మరువలేనివని ,పార్టీ ప్రచారంతో మొదలుకుని ప్రతి విభాగంలో కూడా కార్యకర్తలు ఎంతో సేవ చేశారని, వీరు లేకుండా పార్టీ లేనే లేదని పురంధేశ్వరి అన్నారు.మరోవైపు ఇటివల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి 81.6 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news